PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సామాజిక సాధికార బస్సుయాత్ర సభాస్థలి పరిశీలన

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని కొండపేటలో ఈనెల 10వ తేదీ జరిగే సామాజిక సాధికార బస్సు యాత్ర సభస్థలిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధ్యక్షులు పులి సునీల్ కుమార్, వైయస్సార్ సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మంగళవారం కొండపేటలో పరిశీలించారు, ఈ సందర్భంగా మండల వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి వారు చర్చించారు, సభాస్థలి ప్రాంగణం అలాగే పార్కింగ్ సదుపాయం, తదితర విషయాలపై వారు కొండపేట స్థానిక నాయకులతో, మండల నాయకులతో మాట్లాడడం జరిగింది, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ ఎంపీటీసీలు ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, దుంప నాగిరెడ్డి,  కమలాపుర నియోజకవర్గ యూత్ విభాగం అధ్యక్షులు గోర్ల పుల్లయ్య  శివారెడ్డి, పాలగిరి ఉమామహేశ్వర్ రెడ్డి, టి ఎన్ చంద్ర రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author