PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ తోనే సామాజిక న్యాయం సాధ్యం         

1 min read

పల్లెవెలుగు వెబ్  పత్తికొండ : జగన్ పాలనలోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక న్యాయం సాధ్యపడిందని  పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక వైఎస్ఆర్సిపి ప్రాంతీయ కార్యాలయంలో పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల వైసీపీ నాయకులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగిందని, అలాగే సామాజిక న్యాయం సాధ్యపడిందని తెలిపారు.ఈ నెల 19న విజయవాడలోని స్వరాజ్ మైదానంలో నిర్వహించనున్న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహా విష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్సార్సిసిపి శ్రేణులకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులతో  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సన్నాహక కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే  శ్రీదేవి స్మృతివనం పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజాసంకల్పయాత్ర ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా పత్తికొండ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు..ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గం జడ్పిటిసిలు, ఎంపీపీలు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, సచివాలయం మండల కన్వీనర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

About Author