PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సోషల్ మీడియా కమిటీ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కన్వీనర్ మరియు నలుగురు కో కన్వీనర్ల పేర్లను శనివారం పేర్లను ప్రకటించారు. మిడుతూరు సోషల్ మీడియా మండల కన్వీనర్ గా మిడుతూరు గ్రామానికి చెందిన యు.మాసుం వలిని నియమించారు.అదేవిధంగా మండలానికి నలుగురు కో.కన్వీనర్లుగా పైపాలెం గ్రామానికి చెందిన మర్రి రామేశ్వరుడు,ఉప్పలదడియ గ్రామానికి చెందిన వి.పవన్ కుమార్,తలముడిపి గ్రామానికి చెందిన సయ్యద్ అజ్మతుల్లా,49 బన్నూరు గ్రామానికి చెందిన పెక్కిలి.రామాంజనేయులు అను వీరిని మండల కో.కన్వీనర్లుగా నియమించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈసందర్భంగా మండల సోషల్ మీడియా కమిటీ వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మాకు స్థానం కల్పించినటువంటి రాష్ట్ర శాప్ చైర్మన్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలియజేశారు.

About Author