PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాంకేతిక విప్లవ రథసారథికి ఘననివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: సాంకేతిక విప్లవ రథసారథి భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ ఘన నివాళులర్పించారు కాంగ్రెస్​ నగర కమిటీ అధ్యక్షుడు జాన్​ విల్సన్​. శుక్రవారం రాజీవ్​ గాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని కళావెంకట్రావ్​ భవనంలో రాజీవ్​ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సి క్యాంపు సెంటర్​లోని రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాన్ విల్సన్ గారు మాట్లాడుతూ భారత దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి రాజీవ్ గాంధీ చేసిన కృషి మరువ లేనిదన్నారు. అనంతరం కోవిడ్​–19 జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఆ తరువాత మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి బాబురావు, జిల్లా కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బివి సుబ్రహ్మణ్యం, పీరా రియాజ్ , వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author