NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వతంత్ర సమరయోధుడికి ఘననివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు చివరి నవాబు అమరవీరుడు, స్వాతంత్ర సమరయోధుడు గులాం రసూల్ ఖాన్ కు ఘన నివాళి అర్పించారు కాంగ్రెస్​ శ్రేణులు. నంద్యాల చెక్ పోస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జె.లక్ష్మీనరసింహ యాదవ్ పిలుపు మేరకు.. సోమవారం గులాం రసూల్​ఖాన్​ 181 వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి, జిల్లా నిర్వహణ కార్యదర్శి భరత్ కుమార్ , మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ హాబీబ్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ యూత్ నాయకులు విజయ్ యాదవ్, ఉసేన్, తేజ పాల్గొన్నారు. 39 ఏళ్ల ప్రాయంలోనే రాజీలేని పోరాటం చేసి జరిగిన యుద్ధం భారత దేశ చరిత్ర లోనే ఒక మరపు రాణి మైలురాయి గా చరిత్ర లో గొప్ప యువరాజు గా నిలిచిపోయడని తెలిపారు. గొప్ప పోరాట పటిమ స్ఫూర్తి కలిగిన గులాం రసూల్ ఖాన్ గారి జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠాలు గా అందించాలని డిమాండ్ చేశారు.

About Author