NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చమర్తి జగన్మోహన్ రాజు కు ఘన సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : టిడిపి జిల్లా నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు ను  రాజంపేట పార్లమెంటు తెలుగుయువత కార్యదర్శి నేతి రమేష్ బాబును టిడిపి కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. శనివారం స్ధానిక రాయచోటి పట్టణంలోని జగన్మోహన్ రాజు నివాసంలో  టిడిపి శ్రేణులు మర్యాద పూర్వకంగా ఆయన్ను  కలిశారు. ఇటీవల రాజంపేట పార్లమెంటు కు నూతనంగా తెలుగుయువత కమిటీ ని నియమించారు. ఆ కమిటీలో వీరబల్లి మండలం సానిపాయి గ్రామానికి చెందిన నేతి రమేష్ బాబు ను రాజంపేట పార్లమెంటుకు తెలుగుయువత కార్యదర్శిగా నియమించారు.  రమేష్ బాబు తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన టిడిపి జిల్లా నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు ను మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువ తో ఘనంగా సన్మానించినట్లు రమేష్ బాబు తెలిపారు. టిడిపి బలోపేతానికి ప్రతి ఒక్క టిడిపి కార్యకర్త ఒక  సైనికుడుగా పని చేయాలని జగన్మోహన్ రాజు పిలుపునిచ్చారు. యువత మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల కోసం పోరాడాలన్నారు.

About Author