PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పద్మశాలి నూతన కమిటీ అధ్యక్షుడికి ఘన సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఎమ్మిగనూరు: ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ.. నిత్యం సేవ చేస్తున్న పద్మశాలి బహుతమ సంఘం నూతన అధ్యక్షుడు విశ్వనాథ రమేష్, ఉపాధ్యక్షుడు బండారి ఈరన్న, యువజన సంఘం కోశాధికారి adimai ఉరుకుందును బుధవారం ఎమ్మిగనూరు పట్టణ శ్రీ శివ దత్త సాయి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో గురుస్వామి పోస్టల్ నాగస్వామి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోస్టల్ నాగరాజు స్వామి మాట్లాడుతూ శ్రీశైల పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు పాదయాత్రగా వెళ్లే భక్తులకు విశ్వనాథ్​ రమేష్​, బండారి ఈరన్న, ఆడిమి ఉరుకుందు ..అన్నదానం,షామియా తదితర కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం విశ్వనాథ్ రమేష్ మాట్లాడుతూ దేవుని కృపతో ప్రజలకు, భక్తులకు సేవ చేసే అవకాశం వచ్చిందని, పద్మశాలి మార్కెండేయ దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీ శివ దత్త సాయి అన్నదాన కమిటీ ఉరుకుందు, గోపాల్ , శ్రీరాములు ,రాజశేఖర్, కృష్ణ మూర్తి , డాక్టర్ ముని, తదితరులు పాల్గొన్నారు.

About Author