PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే చొరవతో నీటి ఎద్దడికి పరిష్కారం…

1 min read

పల్లెవెలుగువెబ్, గడివేముల: మండలంలోని పెసరవాయ్ గ్రామంలో వేసవికాలం దృష్ట్యా బోర్లలో నీరు తగ్గిపోయి నీటి ఎద్దడి నెలకొందని గ్రామస్తులు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే , వైసీపీ నాయకులు శ్రీకాంత్​ రెడ్డి, శిరుప శ్రీనివాస రెడ్డిని బోర్లు మరమ్మతు చేయించాలని ఆదేశించారు. బుధవారం పెసరవాయి గ్రామంలోని ఎస్సీ కాలనీ చౌడమ్మ దేవాలయం దగ్గర, సంగమేశ్వరం కాలనీ వద్ద రెండు బోర్లను వైసీపీ నాయకులు శ్రీకాంత్​ రెడ్డి, శ్రీనివాస రెడ్డి వేయించారు. రెండు బోర్లలో నీరు సమృద్ధిగా పడినందుకు పెసరవాయి గ్రామ ప్రజలు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి, శ్రీకాంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

About Author