PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోరాటాలతోనే.. సమస్యకు పరిష్కారం..

1 min read

ఏపీఎన్​జీఓ అసోసియేషన్​ కర్నూలు జిల్లా అధ్యక్షుడు వెంగళ్​ రెడ్డి

పల్లెవెలుగు, కర్నూలు:పోరాటాలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని హితవు పలికారు ఏపీ ఎన్​జీఓ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షులు, జేఏసీ చైర్మన్​ వెంగళ్​ రెడ్డి. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగుల నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని ​ వ్యవసాయ శాఖ ఆవరణలోని క్లాస్​ ఫోర్​ అసోసియేషన్​ బిల్డింగ్​లో  ఏపీఎన్​జీఓ నగర అధ్యక్షుడు కాశన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళ్​ రెడ్డి మాట్లాడుతూ  ఉద్యోగుల సమస్యల సాధనకు సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.  ఏ సమస్య వచ్చినా సమన్వయంతో చర్చించి… పరిష్కారం దిశగా ముందుకు సాగాలన్నారు.  నాల్గవ తరగతి ఉద్యోగుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మూడో సారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్​.మద్దిలేటిని ప్రశంసించారు. అనంతరం ఏపీ ఎన్​జీఓ నగర అధ్యక్షుడు కాశన్న మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటమే.. ఏకైక మార్గమని సూచించారు.  ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా .. తమను సంప్రదిస్తే పరిష్కారానికి నిత్యం కృషి చేస్తామన్నారు. భవిష్యత్​లో ఎదురయ్యే సమస్యలపై నాల్గవ తరగతి ఉద్యోగుల నూతన కమిటీ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు ప్రతిఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని ఏపీ ఎన్​జీఓ నగర అధ్యక్షుడు కాశన్న ఈ సందర్భంగా  పిలుపునిచ్చారు.

నాల్గవ తరగతి ఉద్యోగుల నూతన జిల్లా కమిటీ :

 అధ్యక్షులుగా ఈ.మద్దిలేటి, అసోసియేట్​ ప్రెసిడెంట్​ కె.ఫయాజ్​ బాష, వైస్​ ప్రెసిడెంట్​ వి. లక్ష్మీనారాయణ, వైస్​ ప్రెసిడెంట్​ సి. వెంకటేశ్వర్లు,  జిల్లా సెక్రటరీ సిహెచ్​ భాస్కర్​ రెడ్డి, జాయింట్​ సెక్రటరి ఎన్​.రవిరాజు, జాయింట్​ సెక్రటరి బి. రాముడు, ఆర్గనైజింగ్​ సెక్రటరి కె. సుధాకర్​, ట్రెజరర్​ డిఎండీ షబీర్​ తదితరులను సభ్యులుగా ఎన్నుకున్నారు.

About Author