NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మాదాసి కురువ’ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సోమలింగ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: ఆంధ్రప్రదేశ్ మదాసి కురువ /మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పత్తికొండ పట్టణానికి చెందిన సోమలింగ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం కర్నూలు పట్టణంలో మదాసి కురువ మదారి కురువ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జరిగినది. అనంతరం నూతన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మాదాసి కురువ మదారి కురువ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాల మంజూరు కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తానన్నారు.  కులస్తులకు ప్రభుత్వం ద్వారా రావలసిన సంక్షేమ ఫలాల కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులగా సుంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగరాజ, ట్రెజరర్ గా కిరణ్ లను తదితరులను కులస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

About Author