NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లి కోసం తనయుడు ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:         నందవరం మండలంలోని పోనకలదిన్నె  గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు సంక్షేమ పాలన మళ్ళీ కావాలంటే జగనన్న మళ్ళీ రావాలని వైసీపీ యువ నాయకులు బుట్టా ప్రతుల్  అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గా వైకాపా తరుపున పోటీ చేస్తున్న తల్లి బుట్టా రేణుక ని గెలిపించాలని కోరారు. బుట్టా ప్రతుల్  మాట్లాడుతూ పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగనన్నను మరోసారి గెలిపించుకోవాలని కోరారు.ఈ ప్రచారం లో మండల వైసీపీ అధ్యక్షులు శివారెడ్డి గౌడ్,నియోజకవర్గ వైసీపీ బీసీ సెల్ అధ్యక్షులు ముగతి విరుపాక్షి రెడ్డి, సర్పంచ్ నాగరాజు,సోమలగూడూరు వెంకటేశ్వర రెడ్డి,రాఘవేంద్ర రెడ్డి, ఎంపీటీసీ జైపాల్ రెడ్డి, వెంకటేష్,రామచంద్ర రెడ్డి, మేకల ఈరన్న, బ్రహ్మయ్య ఆచారి,చాకలి రాజు,వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

About Author