PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల బరిలో సోనూసూద్ సోదరి

1 min read


పల్లెవెలుగు వెబ్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కుటుంబం ఎన్నికల బరిలోకి దిగ్గనుంది. సోనూ సోదరి మాళవిక సూద్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు మీడియా సమావేశంలో తెలియజేశారు. మోగా నియోజకవర్గం నుంచి మాళవికా‌సూద్ పోటీ చేస్తారని సోనూసూద్ ప్రకటించాడు. అయితే ఏ పార్టీ నుంచి బరిలో నిలిచే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని… త్వరలోనే ఆ విషయం వెల్లడిస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు మాళవిక సిద్ధమైందన్నారు. ఇటీవలే తాను పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని కలిశానని, త్వరలోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ తోనూ భేటీ అవుతానని సోనూసుద్ తెలిపాడు. ఆరోగ్య రంగమే మాళవికాకు ప్రాధాన్యమని… గెలిస్తే కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా డయాలిసిస్ సేవలను అందిస్తుందని సోనూసుద్ హామీ ఇచ్చారు.

About Author