PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ ను పరిశీలించిన ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆగస్టు 15 (మంగళవారం) న జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సంధర్బంగా  పోలీసుల పరేడ్  రిహార్సల్స్ ను ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో  జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్  పరిశీలించారు. పోలీసుల నుండి జిల్లా ఎస్పీగారు  గౌరవ వందనం స్వీకరించారు.  కవాతు పరిశీలన వాహనం పై నుండి  పోలీసుల కవాతును పరిశీలించారు.అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులకు కల్పించాల్సిన భద్రత  , మౌళిక వసతుల గురించి  సమీక్షించారు.  ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగబాబు, ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా, ఆర్ ఐలు.. వియస్ రమణ, పోతురాజు, శివారెడ్డి, రవి కుమార్ , ఎస్సైలు, ఆర్ ఎస్సైలు , సివిల్ , ట్రాఫిక్ , ఏ ఆర్ , ఫైర్ పోలీసులు మరియు హోంగార్డ్స్ తో పాటు  స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఈ కవాతు లో పాల్గొన్నారు .

About Author