PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి : సర్పంచ్ బైరి విజయలక్ష్మి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రుద్రవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ బైరి విజయలక్ష్మి తెలిపారు. సర్పంచ్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రుద్రవరంలోని బొరుగుల పేట మజరా గ్రామాలైన తువ్వపల్లె రెడ్డిపల్లె గ్రామాలలో మంగళవారం పారిశుధ్యం పనులు చేపట్టారు. దోమల నివారణకు కాలనీలలోని రోడ్లు రహదారుల వెంట మురికిని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల మందు పిచికారి చేశారు. తుఫాను ప్రభావంతో కాలనీలలో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ తెలిపారు అలాగే కాలనీలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు.

About Author