PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కిడ్నీ ప‌రీక్ష‌ల‌కు కామినేనిలో ప్ర‌త్యేక ప్యాకేజి

1 min read

* రూ. 5వేల ప‌రీక్ష‌లు రూ.1999కే అందుబాటు

* రాఘ‌వేంద్ర‌న‌గ‌ర్‌లో కిడ్నీ ఆరోగ్యంపై అవ‌గాహ‌న‌

పల్లెవెలుగు వెబ్  హైద‌రాబాద్ : ప్ర‌పంచ కిడ్నీ దినోత్స‌వం సంద‌ర్భంగా ఎల్బీన‌గ‌ర్‌లోని కామినేని ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ఒక ప్ర‌త్యేక కిడ్నీప్యాకేజిని గురువారం ఆవిష్క‌రించారు. సాధార‌ణంగా అయితే రూ.5,040 విలువ చేసే ఈ ప్యాకేజిని కేవ‌లం రూ.1,999కే అందిస్తున్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎల‌క్ట్రోలైట్స్, సీరం క్రియాటినైన్, కిడ్నీ-యూరేట‌ర్-బ్లాడ‌ర్ అల్ట్రాసౌండ్ స్కానింగ్, కంప్లీట్ బ్ల‌డ్ పిక్చ‌ర్, యూరిన్ ప్రోటీన్‌/క్రియాటినైన్ రేషియో, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేష‌న్‌, ఆర్‌బీఎస్, నెఫ్రాల‌జిస్టు క‌న్స‌ల్టేష‌న్ ఉంటాయి. ఈ వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ నెఫ్రాల‌జిస్టు డాక్ట‌ర్ ఎ.సంతోష్ కుమార్ తెలిపారు. హ‌య‌త్‌న‌గ‌ర్‌లోని రాఘ‌వేంద్ర‌న‌గ‌ర్ కాల‌నీలో.. సీనియ‌ర్ సిటిజ‌న్ సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో ఆయ‌న కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం ఎలా అన్న అంశంపై గురువారం మాట్లాడారు. పెద్ద‌వ‌య‌సులో వ‌చ్చే కిడ్నీ స‌మ‌స్య‌ల గురించి వివ‌రించి, వాటిపై అవ‌గాహ‌న క‌ల్పించారు.

About Author