PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పాలధార–పంచధార ’ వద్ద ఆదిశంకరాచార్యులకు ప్రత్యేక పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: భారత ప్రధాని నరేంద్రమోదీ కేదార్​నాథ్​ క్షేత్రంలోని ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి.. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు …శుక్రవారం హఠకేశ్వరంలోని పాలధార –పంచధార వద్ద ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రాంతంలో శ్రీశైల దేవస్థానం ఆలయ పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ దక్షిణ మాడ వీధిలో కళారాధన వేదిక వద్ద పలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. దక్షిణ ప్రాంత సాంస్కృతిక మండలి, భారత ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, తంజావూరు మరియు దేవస్థానం సంయుక్త నిర్వహణలో సాంస్కృతిక కార్యక్రమాలు.. నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న, బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి నాయకులు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

About Author