PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీరబ్రహ్మేంద్ర స్వామి కి ప్రత్యేక పూజలు

1 min read

పల్లెవెలుగువెబ్​, చెన్నూరు: మండల కేంద్రంలోని శివాలయంలో శుక్రవారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కాలజ్ఞాన ప్రదాత వీరబ్రహ్మేంద్ర స్వామి 328వ సజీవ సమాధి విశిష్టతలోకి వెళ్లిన రోజు కావడంతో స్వామి వారి విగ్రహానికి అభిషేకాలు, పూజలు చేశారు. కోవిడ్​ –19 నిబంధనలు పాటిస్తూ స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహించిన ఆలయ నిర్వాహకులు.. ఈ ఏడాది అన్నదానం, స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలను రద్దు చేశారు. ఉదయం స్వామికి అభిషేకము ను నిర్వహించారు అనంతరం నూతన వస్త్రాలను ధరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు విశ్వనాథ్, యల్లారెడ్డి, హరి, సాయి పాల్గొన్నారు.

About Author