PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కు… విశేష స్పందన

1 min read

పల్లెవెలుగు వెబ్​:కర్నూలు నగరంలోని స్థానిక 14 వ వార్డ్ బుధవార పేట నందు గల 33వ సచివాలయం పరిధిలో ఆదివారం కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ గారు గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడపగడప కార్యక్రమాన్ని చేపట్టిందని కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ తెలిపారు.  ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసమే జగనన్న ప్రభుత్వం సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి, ఇంకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకే మీ ముందుకు వచ్చామని అన్నారు.  డ్రైనేజీ,రోడ్లు  మరియు పలు చోట్ల కరెంటు తీగలతో ఇబ్బంది పడుతున్నామని ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే పరిష్కరించాలని అక్కడున్న అదికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక 14వ వార్డు పార్టీ నాయకులు కోఆప్షన్ మేంబర్ శ్రీరాములు, పర్ల సూర్యుడు, మంజులత, శౌకధ్ అలి, కేదార్ నాథ్, కిరణ్, రాముడు, శివ, హకీం, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు మరియు సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, కర్నూలు మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అలాగే విద్యుత్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author