NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయం !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు మరోసారి ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో కేంద్రంపై తప్పుడు ప్రచారాల కోసం ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రత్యేక హోదాపై గతంనే స్పష్టత ఇచ్చామని తెలిపారు. ప్రత్యేక హోదా పై మాట మార్చింది టీడీపీ, వైసీపేనని విమర్శించారు. రాష్ట్రాల అప్పులకు కేంద్రమే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ఓబీసీలను కేంద్ర జాబితాలోకి చేర్చే ప్రతిపాదన రాష్ట్రం నుంచి రాలేదని జీవీఎల్‌ నరసింహరావు తెలిపారు.

                                                 

About Author