PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌త్యేక హోదా వ‌ర్సెస్ ఈడీ కేసుల్లా ప‌రిస్థితి ఉంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రిప్రజెంటేషన్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ప‌య్యావుల‌ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారా?.. లేక ప్రధాని మోదీ జగన్‌ను మోసం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో స్పెషల్ స్టేటస్ వర్సెస్ ఈడీ కేసెస్‌ల ఉందన్నారు. బీజేపీకి, వైసీపీకి దృఢమైన సంబంధం ఉందని, ఆ బంధం ఎలాంటిదో పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైందన్నారు. ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు మద్దతు తెలుపుతున్నారని, బీజేపీ ఎంపీల కన్నా వైసీపీ రాజ్యసభ సభ్యులు గొప్పగా పొగడ్తలు కల్పిస్తున్నారని విర్శించారు.

                                       

About Author