PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రికెట్ స్టేడియం పనులను వేగవంతం చేయండి

1 min read

– అక్టోబర్ 2 కు అత్యంత సుందరంగా క్రికెట్ స్టేడియం పూర్తి చేయాలి

 జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో :క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ సంబందిత అధికారులను ఆదేశించారు.గురువారం రాయచోటి పట్టణంలోని శివారు ప్రాంతమైన నక్కవాండ్లపల్లి సమీపంలో జరుగుతున్న క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ క్షేత్ర స్థాయిలో  పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. అక్టోబర్ 2 కల్లా క్రికెట్ స్టేడియం అన్ని హంగులతో అత్యంత సుందరంగా పూర్తి చేయాలని పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. క్రికెట్ స్టేడియం వరకు రోడ్డు నిర్మాణ పనులు, ఆర్చి నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. స్టేడియం నందు చూపరులను ఆకట్టుకునేలా మొక్కలు విరివిగా నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారుమైదానం చుట్టూ నీడనిచ్చే పెద్ద పెద్ద మొక్కలను నాటలన్నారు.దాదాపు 32 ఎకరాలలో నిర్మించే స్టేడియం నిర్మాణ పనులన్నీ నాణ్యతతో మన్నికగా ఉండేలా చేపట్టాలన్నారు. రోడ్డు నిర్మాణం, స్టేడియం సరిహద్దుల చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణం ఏర్పాటు  తదితరాలపై రెవిన్యూ, ఆర్అండ్బి, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రికెట్ స్టేడియంలో కలియతిరిగి పిచ్ నిర్మాణం, అక్కడ నిర్మిస్తున్న గదులను పరిశీలించి శరవేగంగా స్టేడియం పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. స్టేడియం మొత్తం రైన్ గన్ తో తడిపి ఎత్తు పల్లాలు లేకుండా చూడాలన్నారు.రెవిన్యూ, ఆర్అండ్బి, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి అన్నమయ్య నూతన జిల్లాలో మంచి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ సాధవరెడ్డి, డిఈ వెంకటసుబ్బయ్య, తహసిల్దార్ ప్రేమంత్ కుమార్, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.

About Author