NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విహాన్ లో గడపడం ఆనందదాయకం..

1 min read

విహాన్ చారిటబుల్ ట్రస్ట్ బాయ్స్, చిల్డ్రన్స్ హోమ్ ను సందర్శించండి, చేయూత అందించండి..

బహుజన సేన టీమ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరు విద్యానగర్ స్టేట్ బ్యాంక్ కాలనీలో సేవా భావంతో సహృదయంతో సమాజంలో తన వంతు సహాయం చేయాలని సదుద్దేశంతో ముందుకు వచ్చిన కొయ్యగర్ల శ్యామ్ ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు సమాజ సేవకులు,సేవాతత్పరులు చేయూత అందించాలని బహుజన సేన టీమ్ కోరారు.బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు మత్తే బాబి మాట్లాడుతూ సమాజంలో ఒకరు ఒకరు సహాయం చేసుకుంటే సమాజ అభివృద్ధి జరుగుతుందని ఇక్కడ ఉన్న హోమ్ చిల్డ్రన్స్ అందరూ ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో మంచి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.రాష్ట్ర కోర్ కమిటీ కోశాధికారి మత్తే కుమార్ మాట్లాడుతూ ఇకపై విహాన్ కు తన వంతు సహాయం చేస్తానని, తాను చేయడమే కాదు ఇతరులు చేత సహాయం చేసేందుకు తన వంతు తోడ్పాటు అందిస్తానని అన్నారు,ఈ కార్యక్రమంలో బహుజన్ సేన స్టేట్ కోర్ కమిటీ డోలా శాంతి,కర్రే ఏంజిలా స్వరూప రాణి,సత్య జయకుమారి,నిరీక్ష, షణ్ముఖ ప్రియ, హిమాన్స్ కౌశిక్, తదితరులు పాల్గొన్నారు.

About Author