PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోనిలో భక్తిశ్రద్ధలతో ముగిసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు

1 min read


పల్లెవెలుగు వెబ్, ఆదోని: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. గత నాలుగు రోజుల నుంచి అభయాంజనేయ స్వామి దేవాలయంలో ధార్మిక ప్రవచనాలు, భజనలు, గోపూజ కుంకుమార్చలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోవును అభయాంజనేయ స్వామి దేవస్థానం నుంచి పురవీధులలో తిప్పారు.

కార్యక్రమంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకుడు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, అభయాంజనేయ స్వామి దేవస్థానం కార్యదర్శి రాచోటి విశ్వనాథం, కోశాధికారి దైవాదీనంరెడ్డి, సంయుక్త కార్యదర్శి జొహరాపురం హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author