PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి : జిల్లా చీఫ్ కోచ్ షఫీ

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రధాన్యతనివ్వాలని అన్నమయ్య జిల్లా వాలీబాల్ చీఫ్ కోచ్ షఫీ పేర్కొన్నారు. బుధవారం రాయఛోటిలోని కాలేజి మైదానంలో గౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుండి క్రమశిక్షణతో చదువు, క్రీడలలో శిక్షణ తీసుకోవాలన్నారు. తద్వారా ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో రణించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయం ప్రతిఒక్కరూగమనించి చిన్నప్పటి నుంచి శిక్షణ తరగతులు ఇప్పించాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం శిక్షణలో ఉన్న క్రీడాకారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కోచ్ లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

                                         

About Author