PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా కార్యకర్తలపై టిడిపి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు

1 min read

ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ దివాలకోరు  రాజకీయాలకు పాల్పడుతుందని, మా కార్యకర్తలపై అసత్య ప్రచారాలకి పాల్పడుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్.ఎల్.ఏ.  ఆళ్ల నాని అన్నారు. బుధవారం  ఎమ్. ఎల్. ఏ. క్యాంప్ కార్యాలయం లో సివిల్ ఇంజనీర్ బొమ్మి శేషుబాబు ఆళ్ల నానిని కలిసి 43 డివిజన్ లో నా సోదరుని భవన నిర్మాణాన్ని చూసేందుకు వెళ్లిన నాకు బలవంతంగా నా మెళ్ళో  టి.డి.పి. కండువా కప్పి సోషల్ మీడియాలో  పెట్టి టి.డి.పి.లో చేరినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, నేను వై.ఎస్. ఆర్.సి.పి. పార్టీ పుట్టిన నాటి నుండి వై.ఎస్.ఆర్.సి.పి. కార్యకర్తనే నని, మళ్లీ ఎమ్మెల్యేగా ఆళ్ల నాని  గెలుపుకి రానున్న ఎన్నికల్లో నా శాయ శక్తుల  పని చేస్తానని శేషుబాబు అన్నారు. ఆళ్ల నాని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఖందువా శేషుబాబు మెళ్ళో వేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా బి.సి.సెల్ అధ్యక్షులు ఘంటా ప్రసాద్, ఇడా చైర్మన్, బొద్దాని శ్రీనివాస్, బి.సి. నాయకులు కిలాడీ దుర్గారావు, ప్రసాద్, మరియు వైఎస్ఆర్ సి పి మీడియా కోఆర్డినేటర్ కోలా భాస్కరరావు, వైసీపీ నాయకులు గేదెల సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

About Author