PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగరంగ వైభవంగా శ్రీ గోదారంగనాథ స్వాములు వారి కళ్యాణం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీ రంగనాథుని వివాహం అశేష భక్తజన సందోహం నడుమ ఋత్వికుల వేదమంత్రోఛ్ఛారణల మధ్య ….గోవిందా….గోవిందా…..అంటూ రెవెన్యూ కాలనీ లోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహింపడుతున్న భరతమాత మందిరంలో గత నెల రోజులుగా ధనుర్మాస ప్రయుక్త  శ్రీ దేవి భూదేవి సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతినిత్యం అభిషేకం, అలంకరణ,మహానైవేద్యం,మహామంగళ హారతులు నిర్వహిస్తూ నేడు ఉ 10:00 గం.ల నుండి శ్రీ గోదా రంగనాథస్వాముల వారి కళ్యాణం , పుల్లారెడ్డి  ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ,అనంతరం అన్న ప్రసాద వితరణ తో కార్యక్రమం పరిసమాప్తమైంది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, ఆలయ కమిటి అధ్యక్షులు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోషాధికారి సందడి మహేశ్వర్,సహకోషాధి గూడా సుబ్రహ్మణ్యం,బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి,విభాగ్ కన్వీనర్ నీలి నరసింహ,ధర్మప్రసార్ రాష్ట్ర కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్, విభాగ్  కన్వీనర్ విజయుడు,జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ,జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, జిల్లా కోషాధికారి అయోధ్య శ్రీనివాస రెడ్డి,జిల్లా మాతృశక్తి సంయోజిక శ్రీమతి జంపాల రాధిక, బజరంగ్ కన్వీనర్ రాము, నగర అధ్యక్షులు టి.సీ.మద్దిలేటి, కార్యదర్శి ఈపూరి నాగరాజు ,నగర మాతృ శక్తి కన్వీనర్ పావని,దుర్గావాహిని కన్వీనర్ సింధూర శ్రీవాణి,సురేష్,అరుణ్,కార్యాలయం విద్యార్థులు ,ఆలయం కమిటి సభ్యులు.తదితరులు పాల్గొన్నారు.

About Author