NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓం శాంతి ఈశ్వరీయ కార్యాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర ఉన్న ఓంశాంతి ఈశ్వరీయ కార్యాలయంలో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు జన్మదినం పండుగ సందర్బంగా శ్రీ కృష్ఠుడికి  భక్తిశ్రద్ధలతో బ్రహ్మకుమారి శ్రీలక్ష్మి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీ కృష్ణ అష్టమి సందర్బంగా పిల్లలు వేసిన శ్రీ కృష్ణ, గోపికల అలంకరణలు, వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఓంశాంతి ఈశ్వరీయ నిర్వాహకులు రంగస్వామి, రంగన్న, చిదానందం, జయలక్ష్మి, రాధ తదితరులు పాల్గొన్నారు.

About Author