PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి వారి సేవలో సీఐ సుధాకర్ రెడ్డి

1 min read

 పల్లెవెలుగు వెబ్, మిడుతూరు: మండలకేంద్రంలో ఉన్న శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి వారి సన్నిధిలో నందికొట్కూరు రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.సీఐ తో పాటుగా ఎస్ఐ జి. మారుతిశంకర్ పూజలు నిర్వహించారు.ఆలయ కార్యనిర్వహణాధికారి వై.గుర్రెడ్డి వీరికి స్వాగతం పలికారు.తర్వాత ఆలయ ఈవో సిఐ,ఎస్ఐని శాలువా పూలమాలవేసి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.రేపు సా.జరిగే చెన్నకేశవస్వామి రథోత్సవ కార్యక్రమం పట్ల ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలనే వాటిపైనా సీఐ,ఎస్సై ఆలయ ఈఓ కు తెలియజేశారు. తర్వాత పోలీస్ స్టేషన్ వెనుక ఎస్ఐ చేపడుతున్న కోనేరు పనులను సీఐ పరిశీలించారు.పనుల గురించి ఎస్ఐ సిఐ కి వివరంగా తెలియజేశారు.డంపు యార్డ్ లాగా ఉన్న స్థలాన్ని శుభ్రంగా చేసిన ఎస్ఐని సీఐ అభినందించారు.పోలీసుస్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.తదనంతరం కిరాణం మర్చంట్ యజమానులు మరియు ఆటోడ్రైవర్లకు రథోత్సవ కార్యక్రమం గురించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సిఐ సుధాకర్ రెడ్డి,ఎస్సై మారుతి శంకర్ తగు సూచనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య,హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య,పోలీసు సిబ్బంది,పీరుసాహెబ్ పేట సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, పార్థసారథి,పైపాలెం మర్రి.రామేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.

About Author