PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘శ్రీ మద్ది ఆంజనేయస్వామి’ని దర్శించుకున్న భక్తులు..

1 min read

వివిధ సేవల నిమిత్తం రూ: 1,66,834/- ఆదాయం

సుమారు 1200 మందికి అన్నదానం..

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: మండలములోని గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధం మంగళవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు, విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీస్వామివారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆకుల కొండలరావు మాట్లాడుతూ.. ఈరోజు మద్యాహ్నం గం.1.00 ల. వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.1,66,834/- లు సమకూరిందని తెలిపారు. ఈరోజు ఏలూరు జిల్లా దేవదాయ శాఖ అధికారి సిహెచ్. రంగారావు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారని, వారికి ఆలయ మర్యాదలతో స్వాగతించడం జరిగిందని తెలిపారు. సుమారు 1200 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్న ప్రసాద వితరణ జరుపబడిందని తెలిపారు. అదేవిధంగా ఆలయమువద్ద ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకొన్నారని ఆలయ ఈవో చెప్పారు. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ధర్మకర్తలు మల్నీడి మోహనకృష్ణ(బాబీ), పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరిత విజయభాస్కర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.

About Author