PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగరంగ వైభవంగా చెర్లోపల్లి లో శ్రీ సీతారామ కళ్యాణం

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని గొర్లముదివీడు గ్రామం చెర్లోపల్లెలో వెలసిన శ్రీ కోదండ శ్రీ రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణంవైభవంగా నిర్వహించినట్లు శ్రీ రామాలయం కమిటీ సభ్యులు తెలియజేశారు.శుక్రవారం ఉదయం గణపతి పూజ, నవగ్రహారాధన తదుపరి శ్రీ సీతారాములకు అభిషేకం, పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ కళ్యాణం కన్నుల పండువగా , వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన ప్రసాదం చేశారు. సాయంత్రం చెర్లోపల్లి పురవీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బయ్యా రెడ్డి వీరభద్ర స్వామి దేవాలయం చైర్ పర్సన్ విజయమ్మ, రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ దశరధ రామిరెడ్డి పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మరియు రాయచోటి వారు దాదాపు 500 మంది ఈ కల్యాణంలో పాల్గొన్నట్లు కోశాధికారి ఎం .సుధాకర్ రెడ్డి తెలిపారు. అన్నదాన ప్రసాదం శ్రీ చింతం విశ్వనాథరెడ్డి మరియు శివారెడ్డి, రథోత్సవ కార్యక్రమం ఖర్చు శ్రీ చింతం రాజారెడ్డి, మందు గుండు సామాగ్రి ఖర్చుచింతం శివారెడ్డి కళ్యాణాన్ని మాదిరెడ్డి ప్రతాపరెడ్డి మరియు చింతం శ్రీనివాస్ రెడ్డి నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ రమేష్, రవి శంకర్ రెడ్డి, వెంకట శివారెడ్డి పాల్గొన్నారు.

About Author