PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైల మహాక్షేత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్​: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహా క్షేత్రం మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసంం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని గంగాధర మండపం వద్ద భక్తులు కార్తిక దీపారాధన చేశారు. అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లో అన్ని ఏర్పాట్లు చేశారు కార్తీకమాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ వారు కొంతమంది పోలీసు సిబ్బంది నియమించింది.

About Author