PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం డ్యాం 5గేట్లు ఎత్తివేత..!

1 min read

పల్లెవెలుగువెబ్​ : శ్రీశైలం డ్యాం అధికారులు గురువారం రాత్రి 5క్రస్ట్ గేట్లు ఎత్తి స్పిల్​వే ద్వారా వదరనీటిని దిగువ నాగార్జునసాగర్​కు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతంలోని జూరాల జలాశయం, సుంకేసుల బ్యారేజి నుంచి మొత్తం 2,42,373క్యూసెక్యుల వరదనీరు శ్రీశైలజలాశయానికి చేరుతోంది. దీంతో డ్యాం అధికారులు

5గేట్లు ఎత్తి 1,39,915క్యూసెక్కులు, రెండు విద్యుత్​కేంద్రాల నుంచి 58,848క్యూసెక్కుల చొప్పున మొత్తం 2,42,373క్యూసెక్కుల వరదనీటిని నాగార్జునసాగర్​కు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 7.30గంటల సమయానికి డ్యాం వద్ద నీటిమట్టం 884.80అడుగులకు చేరగా జలాశయంలో నీటినిల్వసామర్థ్యం 214.3637టీఎంసీలుగా నమోదయింది.

About Author