PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం డ్యాం.. రెండు గేట్లు ఎత్తివేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: ఆల్మట్టి, నారాయణ్​పూర్​, జూరాల తుంగభద్ర డ్యాం లో నీటి నిల్వ గరిష్టస్థాయిలో నిల్వ ఉండటంతో దిగువ ప్రాంతాలైన జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు 10 అడుగుల మేర రెండు గేట్లను పైకి ఎత్తి 1,70,546 క్యూసెక్యుల నీటిని నాగార్జున సాగర్​కు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 82010 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుండటంతో అధికారులు గేట్లను పైకెత్తారు. గురువారం ఉదయం 6 గంటలకు డ్యాంలో 884 అడుగులు, 212 టీఎంసీల నీరు నమోదైంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మొత్తం 1,70,546 క్యూసెక్కుల నీటిని సాగర్ కి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం జలాశయం గేట్లను పైకెత్తి నీటిని విడుదల చేయడం ఇది రెండోసారి.

About Author