PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం హుండీ ఆదాయం రూ. 2.62 కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూపేణా రూ. 2,62,74,717 లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ కూడా వచ్చిందన్నారు. ఈ కానుకలను భక్తులు 38 రోజులలో సమర్పించారు. పటిష్ఠమైన భద్రత మధ్య హుండీలను నిర్వహించారు. శ్రీశైలంలో ఈ నెల 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 1న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకం, లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, 2న రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు.

                                

About Author