PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక మాసోత్సవానికి శ్రీశైలం ముస్తాబు

1 min read

పల్లెవెలుగువెబ్ : అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం కార్తిక మాసోత్సవాలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. శ్రీశైలంలో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23 వరకు జరిగే కార్తీకమాసం ఉత్సవాలను తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శివుడికి ఇష్టమైన మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో ఆలయా ఈఓ లవన్న అధ్యక్షతన దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామి వారి సన్నిధిలోని నాగులకట్ట ప్రాంగణం వద్ద ఈ ఏడాది భక్తులు దీపారాధనలు చేయడాన్ని రద్దు చేసి ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద ఉత్తర మాడ వీధిలో భక్తులు దీపారాధనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

About Author