PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవత్వం చాటుకున్న శ్రీశైలం పోలీసులు

1 min read
భక్తుడిని మంచంపై తీసుకెళ్తున్న పోలీసులు

భక్తుడిని మంచంపై తీసుకెళ్తున్న పోలీసులు

పల్లెవెలెగు వెబ్​, శ్రీశైలం: శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్లే నల్లమల అడవిలోని భీముని కొలను వద్ద తీవ్ర అస్వస్థతకు గురై.. ఊపిరాడక ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తిని శ్రీశైలం కాపాడారు. బళ్లారి జిల్లా బొమ్మనపల్లి గ్రామానికి చెందిన వేదమూర్తి అనే భక్తుడు నల్లమల అడవి గుండా శ్రీశైలంకు వెళ్లే రహదారిలో… తీవ్ర అస్వస్థతకు గురై పడిపోగా.. అక్కడే ఉన్న భక్తులు 100 ఫోన్​ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్​ఐ హరిప్రసాద్​, సిబ్బంది వెంటనే ఆక్సిజన్​, వైద్యసిబ్బందిని వెంట పెట్టుకుని వెళ్లి.. అక్కడే చికిత్స చేయించి.. భుజాలపై ఎత్తుకుని కైలాస ద్వారం వరకు తీసుకువెళ్లారు . దారి మధ్యలోనే భక్తుడు కోలుకోలేక మరణించినాడని కైలాస ద్వారం వద్ద వైద్యులు నిర్ధారించారు.

About Author