PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌న్నుల‌పండువ‌గా శ్రీశైలం ఉగాది మ‌హోత్స‌వాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉగాది మహోత్సవ వేడుకలు శ్రీగిరిపై అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల పురవీధుల్లో కన్నులపండువగా స్వామిఅమ్మవార్ల రథోత్సవం జరిగింది. రథోత్సవంలో భక్తులతో శ్రీశైలం పురవీధులు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం స్వామిఅమ్మవార్లకు ప్రభోత్సవం, నందివాహన సేవ నిర్వహించారు. అమ్మవారు మహాసరస్వతిగా దర్శనమిచ్చారు. శ్రీశైలంలో రథోత్సవానికి ముందురోజు ప్రభోత్సవం జరిపించడం ఆనవాయితీ. సుగంధ పుష్పాలు, పరిమళ ద్రవ్యాలతో అలకంరించిన ప్రభపై ఆదిదంపతులను ఊరేగించారు. అనంతరం రాత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

                                

About Author