PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైల హుండీ ఆదాయం2,41,95,778 రూ

1 min read

పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం : శ్రీశైల ఆలయ ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 2,41,95,778/ నగదు రూపంలో రాబడిగా లభించింది. అన్నదాన ప్రసాద వితరణల భవనంలో ఉన్న హుండీ ద్వారా11,76,100/- రు లభించాయి. నగదుతో పాటు ఆలయ హుండీలందు 128 గ్రాముల బంగారు, 3 కేజీల 790 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు – 299, ఆస్ట్రేలియా డాలర్లు 30, కెనడా డాలర్లు 120, – మలేషియా రింగిట్స్ – 1, యు.ఎ.ఇ.ధీర్ హమ్లు -15, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. 19 రోజులు ఆదాయంగా హుండీ లెక్కించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. దేవస్థానం ఈవో ఎస్.లవన్న, ధర్మకర్తలమండలి సభ్యులు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మరియు శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.

About Author