NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్యాంకాక్ వెళ్లిన ఎస్సై.. స‌స్పెండ్ చేసిన ఎస్పీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలోని దర్శి ఎస్సై చంద్రశేఖర్‌ ను మలిక గార్గ్‌ సస్పెండ్ చేశారు. ఈ నెల 13న వైసీపీ నేతలతో కలిసి చంద్రశేఖర్‌ బ్యాంకాక్‌ వెళ్లారు. అనుమతి తీసుకోకుండా బ్యాంకాక్‌ వెళ్లడంపై ఎస్పీ సీరియస్‌ అయ్యారు. ఎస్సై, బ్యాంకాక్‌ వ్యవహారంపై విచారణ జరిపి ఎస్పీ సస్సెండ్ చేశారు. అధికారపార్టీ నేతలతో కలిసి చంద్రశేఖర్, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బ్యాంకాక్‌ వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అతనిపై వేటుపడింది. పోలీసు అధికారులు కట్టుతప్పి వ్యవహరిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

                                          

About Author