PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు

1 min read

– సచివాలయం సిబ్బంది సమయపాలన పాటిస్తూ తప్పనిసరిగా హాజరు వెయ్యాలి
పల్లెవెలుగు వెబ్ రుద్రవరం: గ్రామ సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమయపాలన పాటిస్తూ తప్పనిసరిగా హాజరువేయాలని ఎంపీడీవో మధుసూదనరెడ్డి హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అయిన పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని తద్వారా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పారిశుధ్యం త్రాగునీటి పై నిర్లక్ష్యం చేయరాదని ఇంటి పన్నులు త్వరగా పూర్తి చేయాలని పలు అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ సమావేశంలో ఈవోపీఆర్డి భాగ్యలక్ష్మి ఏవో వరలక్ష్మి పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

About Author