PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 రైతు భరోసా కేంద్రాలలో జొన్న కొనుగోలు  ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలంలో  రబి 2023- 24 సీజన్లో జొన్న పంట ఆరువేల ఎకరాలలో సాగు చేసినట్టు శుక్రవారం మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు  సివిల్ సప్లయిస్ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల యందు కనీసం మద్దతు ధర ఒక క్వింటాలకి 3180 రూపాయలతో కొనుగోలు చేయడం జరుగుతుందని. వీటికి ముఖ్యంగా రైతు సోదరులు పంట నమోదు చేసుకొని వేలిముద్ర వేసుకోవలసి ఉంటుందన్నారు. సంబంధిత రైతు భరోసా కేంద్రాలలో ఈ ప్రక్రియ ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రైతులకు సంచులు, హమాలీ, మరియు  రవాణా కూడా ప్రభుత్వం అందజేస్తుందని. నాణ్యతకు  లోబడి సరుకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.

About Author