NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర ఫైనాన్స్ సెక్రెటరీని కల్సిన రాష్ట్ర ఏపీఎన్జీవోస్ అసోసియేషన్

1 min read

– పెన్షనర్ల ఇబ్బందులను రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ కెవి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లిన ఎపిఎన్జీవోస్ అసోసియేషన్ నాయకులు..

పల్లెవెలుగు  వెబ్ ఏలూరు జిల్లా :  మంగళగిరి నిధి భవన్ లో రాష్ట్ర ఫైనాన్స్ సెక్రెటరీ కె వి సత్యనారాయణ ను కల్సిన రాష్ట్ర ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్, కె వి శివారెడ్డి  మరియు కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఫంక్షనర్ల పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ కి తెలియ చేసేందుకు ప్రత్యేకంగా కలిశారు. రాష్ట్రంలో ఇంకా 10 శాతం పెన్షన్లు పడలేదని, ఇబ్బందులు కు గురువుతున్న పెన్షర్ల ని వారి ఇబ్బందులను తెలియజేస్తూ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిస్టం లో వెరిఫై చేసి ఇంక కేవలం 196 మందికి పడలేదని, రేపు అవి కూడా క్లియర్ అవుతాయని తెలిపారు. అనంతరం బండి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగుల కు,ఉపాధ్యాయులు కు సరెండర్ లీవ్స్, GPF s, మెడికెల్ బిల్స్ కూడా రావటం లేదని వెంటనే పెండింగ్ బిల్స్ క్లియర్ చెయ్యమని కోరారు. ఫైనాన్స్ సెక్రెటరీ స్పందిస్తూ త్వరలో అవి కూడా క్లియర్ చేస్తామని నాయకులు కు  సత్యనారాయణ హామీ ఇచ్చారు.

About Author