PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రేసులో లేను !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగోలేదని ప్రధాని మోదీ, అమిత్ షాలకు స్పష్టంగా చెప్పానని కేఏ పాల్ వెల్లడించారు. బీజేపీ అభ్యర్ధే రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు ఐక్యం కావాలన్నారు. ప్రతిపక్షాలు వేరు వేరు కుటములుగా ఉండొద్దని పాల్ సూచించారు. ‘‘నేను ఓడిపోయే వారి పక్షాన ఉండను. ప్రతిపక్షాల్లో ఐక్యత లేదు. ప్రతిపాదించన వారు కూడా రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ అభ్యర్ధి 60 శాతం ఓట్లతో గెలుస్తారు. నేను రాష్ట్రపతి అభ్యర్థి కాదు. బీజేపీ, కాంగ్రెస్ వల్ల దేశం నాశనం అయిపోతోంది. దేశ అభివృద్ధిపై రాజకీయ పక్షాలు దృష్టి సారించాలి. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లే బీజేపీ బలంగా ఉంది. మంచి తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకి ప్రతిపాదించా.“ అని కేఏ పాల్ అన్నారు.

                                           

About Author