PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

1 min read
మాట్లాడుతున్న లక్ష్మి నరసింహ యాదవ్​

మాట్లాడుతున్న లక్ష్మి నరసింహ యాదవ్​

పరిషత్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించండి..
– నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యమని నంద్యాల పార్లమెంట్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడు లక్ష్మినరసింహ యాదవ్​ అన్నారు. ఆదివారం నంద్యాల చెక్​ పోస్టు సమీపంలోనిపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయ మాట్లాడారు. స్థానిక పంచాయతీ ఎన్నికలలో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇరవై నాలుగు శాతానికి కుదించిన వైసీపీకి.. బీసీల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. జనాబా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని దేశం, రాష్ట్రంలోనూ ఉద్యమాలు జరుగుతుంటే.. వైసీపీ బీసీల రాజకీయ అభివృద్ధికి అడ్డుకట్ట వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక… ఏ ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరగలేదన్నారు. ఈనెల 8న జరగనన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కల్లూరు జెడ్పీటీసీ అభ్యర్థి భరత్ కుమార్ , జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి, అభ్యర్థి యూత్ కాంగ్రెస్ నాయకులు విజయ్ కుమార్ యాదవ్ , జిల్లా మైనార్టీ నాయకులు పఠాన్ హబీబ్ ఖాన్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ నాయుడు , సోమశేఖర్ ,రాజు, రవి రామకృష్ణారెడ్డి, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

About Author