PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి … టి.జి భ‌ర‌త్

1 min read

– ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇస్తే క‌ర్నూలును అభివృద్ధి చేస్తాన‌న్న భ‌ర‌త్
పల్లెలుగు, వెబ్​ కర్నూలు: ఇది పేద‌ల ప్ర‌భుత్వ‌మంటున్న‌ప్పుడు అన్న క్యాంటిన్ల‌ను కొన‌సాగించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూలు న‌గ‌రంలోని 48వ వార్డులో టిడిపి స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంతో పాటు, ఒక్క రోజు అన్న క్యాంటిన్ కార్యక్ర‌మంలో పార్ల‌మెంటు అధ్య‌క్షుడు సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లుతో క‌లిసి ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా భ‌ర‌త్ మాట్లాడుతూ పేద‌ల ఆక‌లి తీర్చే అన్న క్యాంటిన్ ప్రాధాన్య‌త ప్ర‌భుత్వానికి తెలిసేందుకే క‌ర్నూల్లోని 33 వార్డుల్లో ఒక్క రోజు అన్న‌ క్యాంటిన్ పెడుతున్నామ‌న్నారు. వచ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తే రాష్ట్ర భ‌విష్య‌త్తు బాగుంటుంద‌న్నారు. అక్క‌డ చంద్ర‌బాబు, ఇక్క‌డ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు. తాను ఎమ్మెల్యే అయితే క‌ర్నూల్లో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా చేస్తాన‌న్నారు. ఏపీలో చంద్ర‌బాబును ఓడ‌గొట్టి ప్ర‌జ‌లు పొర‌పాటు చేశార‌ని సింగ‌పూర్‌లో ఉంటున్న భార‌తీయులు మాట్లాడుకుంటున్నార‌న్నారు. టిడిపి అధికారంలో ఉండి ఉంటే అమ‌రావ‌తి బ్ర‌హ్మాండంగా డెవ‌లప్ అయ్యేద‌న్నారు. అందుకే ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఆలోచించి ఓటు వేయాల‌ని కోరారు. అనంత‌రం సోమిశెట్టి మాట్లాడుతూ 2024 ఎన్నిక‌ల్లో చంద్రబాబు నాయ‌క‌త్వాన్ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌న్నారు. క‌ర్నూల్లో భ‌ర‌త్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల‌న్నారు. టిడిపి అధికారంలోకి వ‌స్తేనే రాష్ట్రం బాగుప‌డుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర అధ్య‌క్షుడు గున్నామార్క్‌, వార్డు ఇంచార్జి మ‌న్సూర్ ఆలీఖాన్‌, నేత‌లు దేవా, శ్యాం, వ‌లి, వినోద్ చౌద‌రి, శ్రీధ‌ర్‌, ర‌మీజ్‌, చంద్ర‌క‌ళాభాయ్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author