NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిఎస్పీ  నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ

1 min read

– పాల్గొన్న ఎమ్మెల్యే  ముదునూరి.. ప్రసాద్ రాజు, ప్రజా ప్రతినిధులు సిబ్బంది..

పల్లెవెలుగు వెబ్ పశ్చిమగోదావరి జిల్లా : నరసాపురంలో నూతనంగా నిర్మించిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్ పి) అధునాతన  కార్యాలయ నూతన భవనాన్ని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె.రాజేంద్రనాద్ రెడ్డి ఐపీఎస్ ప్రారంభించారు.ఈసందర్భంగా నరసాపురం విచ్చేసిన డిజిపి కి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ప్రత్యేక ఆహ్వానం మేరకు వి చ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ నినాదంతో అన్ని వర్గాల ప్రజలకు సేవా భావంతో పాదర్శకమైన సేవలు అందించాలని సూచించారు. ఏలూరు రేంజ్ డి.ఐ.జి అశోక్ కుమార్, ఎస్పీ రవి ప్రకాష్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

About Author