NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు.. విప‌క్షాల‌కు షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ఎంపికలో విప‌క్షాల‌కు భారీ షాక్ త‌గిలింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా రేసు నుంచి తప్పుకున్నారు. తాను వైదొలుగుతుండడంపై శనివారం మధ్యాహ్నాం స్వయంగా ఆయన ప్రకటించడం విశేషం. జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా సైతం రేసు నుంచి తప్పుకున్నారు. ‘‘జమ్ము కశ్మీర్‌ ఒక క్లిష్టమైన ఘట్టం గుండా వెళుతోంది. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. నా సేవలు స్వరాష్ట్రానికి అవసరం అని భావిస్తున్నా. అందుకే రాష్ట్రపతి రేసు నుంచి మర్యాదపూర్వకంగా వైదొలుగుతున్నా’’ అని తెలిపారాయన.

                                  

About Author