NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోనిలో పర్యటించిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు

1 min read

– బొల్లిశెట్టి సత్యనారాయణ
పల్లెవెలుగు వెబ్ ఆదోని: గత ఏడాది నవంబర్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు నామాల పరుశురాం కుటుంబానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరుపున 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు.అనంతరం ఆదోని జనసేన పార్టీ తరుపున ఏర్పాటు చేసిన సంతాప సభలో పరుశురాం చిత్రపటానికి జనసేన నాయకులు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన జనసేన రాష్ట్ర నేత బొల్లిశెట్టి, రాష్ట్రంలో కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులు గా చూసే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని కొనియాడారు దశాబ్దాలుగా మెగా ఫ్యామిలీ కి నమ్మకమైన వ్యక్తి మల్లప్ప అని .జనసేన కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు ఉన్న మల్లప్ప దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.ఆదోని జనసేన ఇంచార్జి మల్లప్ప మాట్లాడుతూ ఆదోని జనసైనికుల కుటుంబానికి అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, తెలిపారుఆదోని నియోజకవర్గం పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని జనసేన నేతలు తెలిపారు.

About Author