NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉప్పలదడియలో రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలు

1 min read

– 4వ తేదీ ఎద్దుల పోటీలు ప్రారంభం -బహుమతి రాని ప్రతి కాడికి 3 వేలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో శ్రీరామనవమి మరియు గుడ్ ఫ్రైడే సందర్భంగా గ్రామంలో రాష్ట్రస్థాయి 6 పళ్ళ వృషభ రాజుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కమతం జయరామిరెడ్డి తెలిపారు. ఈనెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు పోటీల్లో ప్రారంభం అవుతాయని పోటీల్లో పాల్గొనదలచిన వారు 500 రూపాయలు ప్రవేశము చెల్లించి పోటీలో పాల్గొనాలని ఆయన తెలియజేశారు. మొత్తం ఆర్ బహుమతులు ఉన్నాయని మొదటి బహుమతిగా 40 వేలు,రెండవ బహుమతి 30వేలు,3వ బహుమతి 20వేలు,4వ బహుమతి 15వేలు,5వ బహుమతి 10వేలు,6వ బహుమతి 6వేలు ఉన్నాయని అంతేకాకుండా బహుమతి రాని ప్రతి కాడికి 3 వేల రూపాయలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈపోటీలను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా కాటం మురళీధర్ రెడ్డి,కాత రమేష్ రెడ్డి,ఖాతా రాజారెడ్డి హాజరు అవుతున్నారని తెలిపారు.మరిన్ని వివరాలకు-9959435354, 9866416512 ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు.

About Author