PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శారదమ్మ జ్ఞాపకార్థం.. రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు

1 min read

పల్లెవెలుగు:  నగర శివారులోని ఆదర్శ విద్యా మందిర్ పాఠశాల క్రీడా మైదానంలో కీర్తిశేషులు శారదమ్మ జ్ఞాపకార్థం  ఆదివారం నుంచి రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి రగ్బీ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలను బాల,బాలికల విభాగంలో నిర్వహిస్తున్నట్లు ఆదర్శ విద్యా మందిర్ పాఠశాలల డైరెక్టర్ డాక్టర్ హరికిషన్ తెలిపారు .శనివారం సాయంత్రం పాఠశాల ఆవరణలో జరిగిన జిల్లా జట్టు క్రీడాకారుల దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలకు  రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన  బాలుర విభాగంలో 13 జట్లు బాలికల విభాగంలో 13 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు . ఆదర్శ విద్యా మందిర్ యాజమాన్యం సహకారంతో సహకారంతో ఉచిత భోజన విడిది వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు పోటీల ప్రారంభ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా జట్టు క్రీడాకారులు రాణించి విజేతలుగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర రగ్బీ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు,ఫీజికల్ డైరెక్టర్స్ మాధవి లక్ష్మీ,వెంకట లక్ష్మీ, కిరణ్, మాబుసుభాని,వెంకటేష్, పరశురాముడు పాల్గొన్నారు.

About Author